- నామా నాగేశ్వరరావు : బాల్యం, విద్య, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం.. on March 19, 2024 at 12:29 am
Nama Nageswara Rao Biography: జాతీయస్థాయి రాజకీయాలలో తనకంటూ ముద్ర వేసుకున్న నాయకుడు నామా నాగేశ్వర రావు . ఇప్పటికే రెండుసార్లు లోక్ సభ సభ్యుడిగా ఎన్నిక ఆయన మరోసారి ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఇంతకీ ఆయన వ్యక్తిగత , రాజకీయ జీవిత ప్రస్థానమేంటో తెలుసుకుందాం. బాల్యం, కుటుంబం ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి పార్టీ తరఫున ఖమ్మంలోక్సభ నియోజకవర్గం పార్లమెంట్ సభ్యునిగా ప్రాతినిథ్యం వహిస్తున్న సీనియర్ రాజకీయ నాయకులు నామా నాగేశ్వర్ రావు. ఆయన 1957 మార్చి 15న మహబూబాబాద్ జిల్లా కొరవి మండలం బలపాల గ్రామంలో నామ ముత్తయ్య వరలక్ష్మి దంపతులకు జన్మించారు. నాగేశ్వరరావుకు చిన్నమ్మతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె. రాజకీయ జీవితం నామా నాగేశ్వర రావు రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీలో ప్రారంభమైంది. ఆయన మొదటి సారి 2004లో టీడీపీ తరపున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేణుక చౌదరి పై పోటీ చేసి లక్ష ఓట్ల తేడాతో ఓడిపోయాడు. తిరిగి 2009లో రేణుక చౌదరి పోటీ సుమారు లక్ష 25 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. అలా తొలిసారి నామా నాగేశ్వర రావు పార్లమెంట్ లో అడుగుపెట్టారు. అలాగే.. లోక్సభలో తెలుగుదేశం పార్లమెంటరీ నాయకుడిగా ఆయన నియమితులయ్యారు. అదే విధంగా పబ్లిక్ అండర్టేకింగ్స్, రవాణా, పర్యాటకం, సాంసృతిక కమిటీలలో సభ్యుడిగా నియమితులయ్యారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో ఖమ్మం నియోజకవర్గ నుంచి పోటీ చేసిన నామా 11 వేల ఓట్ల తేడాతో వైసిపి అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతిలో ఓడిపోయాడు. ఆ తరువాత 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఈ పరిణామంతో 2019, మార్చి 21న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు. అదే సంవత్సరం అంటే.. 2019లో పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసి ఖమ్మం ఎంపీగా గెలిచాడు. ఆయన ప్రస్తుతం బీఆర్ఎస్ లోక్సభ పక్ష నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రారంభ జీవితం.. నాగేశ్వరావు రాజకీయాల్లోకి రాకముందు విజయవంతమైన వ్యాపారవేత్తగా పేరు గడించాడు. పార్లమెంట్ లో పార్టీ అధ్యక్షుని సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. హిందీ, తెలుగు భాషల్లో అనర్గతంగా మాట్లాడగల ఆయన కాశ్మీర్ ఏర్పాటు వాదులతో చర్చించడానికి పార్లమెంట్ నుంచి వెళ్ళిన అఖిలపక్ష బృందంలో ఆయన ఒకరు. 2009 లోక్ సభ ఎన్నికల సమయంలో తెలిపిన సమాచారం ప్రకారం.. ఆయన ఆస్తుల విలువ దాదాపు 173 కోట్లు. రాజకీయాలతో సంబంధం లేకుండా ఆయన తండ్రి నామ ముత్తయ్య పేరు మీద ట్రస్ట్ ఏర్పాటు చేస్తే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాడు. ప్రజల సమస్యలపై కేంద్రంతో పోరాడి ఎంజిఎన్ఆర్ఈజీఎస్, సెంట్రల్ జాతీయ రహదారులు కొరకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయించుకున్నారు. కరోనా సమయంలో కోట్ల విలువైన శానిటైజర్లు, మాస్కులను పంపిణీ చేశారు. నామా నాగేశ్వర రావు బయోడేటా.. పూర్తి పేరు: నామా నాగేశ్వర రావు పుట్టిన తేదీ: 15 Mar 1957 (వయస్సు 67) పుట్టిన ప్రాంతం: బలపాల, తెలంగాణ పార్టీ పేరు : వృత్తి: వ్యాపారం తండ్రి పేరు: ముత్తయ్య తల్లి పేరు : నామా వరలక్ష్మీ జీవిత భాగస్వామి: నామా చిన్నమ్మ
- Today Horoscope: ఓ రాశివారికి శ్రమ అధికం .. కానీ పనులు వేగవంతం కావుon March 19, 2024 at 12:00 am
Today Horoscope:ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు.శుభ సమాచారం అందుకుంటారు, వ్యాపారాలు పరంగా సానుకూల ఫలితాలను పొందవచ్చు. వ్యాపార పరమైన చర్చలు జరుపుతారు.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. 19-3-2024,మంగళవారం మీ రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలు తో..) జోశ్యుల రామకృష్ణ – ప్రముఖ జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు – గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి) ‘శ్రీ మాతా’ వాస్తు… జ్యోతిష్యాలయం- ఫోన్: 8523814226 (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు పెట్టండి …సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను) రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది…ఎవరికి ఇబ్బందులు ఉంటాయి …ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం మేషం (అశ్విని భరణి కృత్తిక 1) నామ నక్షత్రాలు(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ) తారా బలము అశ్విని నక్షత్రం వారికి (నైధనతార)పనిలో ఆటంకాలు.వాహన ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి.అనవసరపు ఖర్చులు. భరణి నక్షత్రం వారికి(సాధన తార) కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం.అన్ని వృత్తుల వారికి అనుకూలంగా ఉండును.సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కృత్తిక నక్షత్రం వారికి (ప్రత్యక్తార)అధిక శ్రమ. అధికారులు తో వివాదాలు. అకారణ కోపం.నిందారోపణలు ఏర్పడును. దిన ఫలం:-శుభ ఫలితాలను పొందగలరు.ఉత్సాహంగా గడుపుతారు.అన్ని రకాల సౌకర్యాలు సమకూరుతాయి.ఇతరుల సహాయ సహకారాలు అంది వస్తాయి.వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి.హోదా గల వ్యక్తులు తో స్నేహ లాభాలు పొందగలరు.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ప్రయాణాలను చేయవలసి వస్తుంది. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొంటారు.ఓం వినాయకాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి. వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి మృగశిర 1 2) నామ నక్షత్రాలు(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో) తారాబలం రోహిణి నక్షత్రం వారికి (క్షేమతార)శుభ నూతన కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు.వృత్తి వ్యాపారంలో ధన లాభం.గౌరవంగా గడుపుతారు. మృగశిర నక్షత్రం వారికి (విపత్తార)అనుకోని సంఘటనలు ఎదురవుతాయి.అకారణ కలహాలు.వృత్తి వ్యాపారాలు జాగ్రత్త అవసరం.పనులలో ఆటంకాలు. దిన ఫలం:-జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.వృత్తి వ్యాపారాలలో ధన లాభం. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు.సమాజంలో ఉన్నతమైన వ్యక్తులు తో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహము కలుగును.పాత బాకీలు వసూలు చేస్తారు.ఓం అనంత పద్మనాభాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి. మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర పునర్వసు 1 2 3) నామ నక్షత్రములు(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి) తారాబలం ఆరుద్ర నక్షత్రం వారికి (సంపత్తార)వృత్తి వ్యాపారంలో ధన లాభం.నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు.శుభవార్తలు వింటారు. పునర్వసు నక్షత్రం వారికి(జన్మతార)అధికారులు తో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం. దిన ఫలం:-వృత్తి వ్యాపారాల్లో ధన నష్టము. ఆరోగ్య సమస్యలు రావచ్చు. విలువైన వస్తువుల యందు జాగ్రత్త అవసరం.అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సమాజంలో అవమానాలు కలగవచ్చు.ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి.రుణాలు చేయవలసి వస్తుంది. చెడు పనుల యందు ఆసక్తి పెరుగుతుంది. ప్రయత్నించిన ప్రతి పనిలో అడ్డంగులు ఏర్పడగలవు. ఇతరుల నిందలకు పాత్రులు అవుతారు.ఓం దుర్గాయై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి ఆశ్లేష 1 2 3 4): నామ నక్షత్రాలు(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో) తారాబలం పుష్యమి నక్షత్రం వారికి(పరమమిత్ర తార)వ్యవహారాల్లో ఆటంకములు.అకారణ కలహాలు.శారీరక బాధలు.వ్యాపారంలో ధన నష్టము రావచ్చు. ఆశ్రేష నక్షత్రం వారికి (మిత్ర తార)శుభ కార్యక్రమాలకు మంచిది. వృత్తి వ్యాపారంలో అధిక ధనాదాయం లభించును. నూతన పరిచయం. దిన ఫలం:-అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది.మానసికంగా భయాందోళన గా ఉంటుంది. ఉద్యోగాలలో అధికారులు తో అకారణంగా విరోధాలు రాగలవు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.అనుకున్న పనులు పూర్తి గాక ఇబ్బందులకు గురి అవుతారు.సమాజంలో గౌరవ మర్యాదలు తగ్గును. భాగస్తుల మూలకంగా కష్టనష్టాలు రాగలవు.ఓం ఆదిత్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి. సింహం (మఖ పుబ్బ ఉత్తర 1) నామ నక్షత్రాలు(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే) తారాబలం మఘ నక్షత్రం వారికి(నైధనతార)పనిలో ఆటంకాలు.వాహన ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి.అనవసరపు ఖర్చులు. పూ.ఫల్గుణి నక్షత్రం వారికి (సాధన తార)కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం.అన్ని వృత్తుల వారికి అనుకూలంగా ఉండును.సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి(ప్రత్యక్తార)అధిక శ్రమ.అధికారులు తో వివాదాలు.అకారణ కోపం.నిందారోపణలు ఏర్పడును. దిన ఫలం:-కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు.శుభ సమాచారం అందుకుంటారు, వ్యాపారాలు పరంగా సానుకూల ఫలితాలను పొందవచ్చు. వ్యాపార పరమైన చర్చలు జరుపుతారు.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మానసికంగా ఆనందంగా గడుపుతారు. ఓం మహేశ్వరాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి. కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2): నామ నక్షత్రాలు(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో) తారాబలం హస్త నక్షత్రం వారికి (క్షేమతార) శుభ నూతన కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు.వృత్తి వ్యాపారంలో ధన లాభం. చిత్త నక్షత్రం వారికి (విపత్తార)అనుకోని సంఘటనలు.అకారణ కలహాలు ఏర్పడగలవు.వృత్తి వ్యాపారాలలో జాగ్రత్త అవసరం.పనులలో ఆటంకాలు. దిన ఫలం:-ఇతరులతో అకారణంగా కలహాలు రాగలవు.తలపెట్టిన పనులు లో ఆటంకాలు ఏర్పడగలవు. శత్రువులు మూలకం గా భయంగా ఉండును.వ్యవహారాలలో ఆలోచించి అడుగు వేయుట మంచిది.ఆదాయానికి మించి ఖర్చు చేయాల్సి వస్తుంది. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. నూతన ఆలోచనలు కలుగును. ఓం దక్షిణామూర్తయే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి. తుల (చిత్త 3 4, స్వాతి విశాఖ 1 2 3) నామ నక్షత్రాలు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే) తారాబలం స్వాతి నక్షత్రం వారికి (సంపత్తార)వృత్తి వ్యాపారంలో ధన లాభం.నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు.శుభవార్తలు వింటారు. విశాఖ నక్షత్రం వారికి (జన్మతార)అధికారులు తో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం. దిన ఫలం:-అనవసరమైన కలహాలకు దూరంగా ఉండాలి.శత్రువుల వలన అపకారం జరగవచ్చు. మానసిక భయాందోళన గా ఉంటుంది.తలచిన పనులు తగు సమయానికి పూర్తి గాక ఇబ్బందులకు గురి అవుతారు.ప్రతి విషయంలో నిరుత్సాహంగా ఉంటుంది.ఓం మృత్యుంజయాయ నమః అన్న జపించండి శుభ ఫలితాలను పొందండి. వృశ్చికము (విశాఖ 4, అనూరాధ జ్యేష్ఠ ) నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు) తారాబలం అనూరాధ వారికి (పరమమిత్ర తార) వ్యవహారాల్లో ఆటంకములు. అకారణ కలహాలు.శారీరక బాధలు.ధన నష్టము. జ్యేష్ఠ నక్షత్రం వారికి (మిత్ర తార)శుభ కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. వృత్తి వ్యాపారంలో అధిక ధనాదాయం లభించును.నూతన పరిచయం. దిన ఫలం:-బంధు మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. విద్యావంతుల తో పరిచయాలు ఏర్పడతాయి.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగును.అధికారులు తో స్నేహ సంబంధాలు బలపడతాయి.అనుకున్న పనిలో విజయం సాధిస్తారు.అన్ని విషయాలు అనుకూలంగా ఉంటాయి.సంఘంలో ప్రతిభకు తగ్గ గౌరవం లభిస్తుంది. ముఖంలో వర్చస్సు పెరుగుతుంది. మానసిక ఆనందం పొందగలరు.ఓం వేంకటేశ్వరాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి. ధనుస్సు (మూల పూ.షాఢ ఉ.షాఢ 1) నామ నక్షత్రాలు(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే) తారాబలం మూల నక్షత్రం వారికి (నైధనతార)పనిలో ఆటంకాలు.వాహన ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి.అనవసరపు ఖర్చులు. పూ.షాఢ నక్షత్రం వారికి (సాధన తార)కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం.అన్ని వృత్తుల వారికి అనుకూలంగా ఉండును.సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉ.షాఢ నక్షత్రం వారికి (ప్రత్యక్తార)అధిక శ్రమ.అధికారులు తో వివాదాలు.అకారణ కోపం.నిందారోపణలు ఏర్పడును. దిన ఫలం:-కారణం లేకుండానే తగాదాలు రావొచ్చు. ఖర్చులు అధికంగా ఉంటాయి. క్రయ విక్రయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.ఆర్థిక విషయాలు నిరుత్సాహం కలిగిస్తాయి. శారీరకంగా మానసికంగా బలహీనంగా ఉంటుంది. పనులలో ఆటంకాలు ఏర్పడతాయి.శ్రమకు తగిన ఫలితం లభించడం కష్టంగా ఉంటుంది.ఆరోగ్య సమస్యలు రాగలవు.ప్రతి విషయంలో ఆచితూచి అడుగులు వేయాలి. తెలీకుండానే పొరపాట్లు జరగవచ్చు.ఓం శ్రీనివాసాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి. మకరం (ఉ.షాఢ 2 3 4, శ్రవణం ధనిష్ట 1 2) నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ) తారాబలం శ్రవణా నక్షత్రం వారికి (క్షేమతార)శుభ నూతన కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు.వృత్తి వ్యాపారంలో ధన లాభం. ధనిష్ఠ నక్షత్రం వారికి (విపత్తార)అనుకోని సంఘటనలు.అకారణ కలహాలు ఏర్పడగలవు.వృత్తి వ్యాపారాలలో జాగ్రత్త అవసరం.పనులలో ఆటంకాలు. దిన ఫలం:-పెద్దలు మరియు గురువు లు యందు భక్తిశ్రద్ధలు పెరుగుతాయి.అలంకార వస్తువులు కొనుగోలు చేస్తారు. సమాజంలో గౌరవం లభించును.ఆసక్తికరమైన విషయాలు వింటారు. వృత్తి వ్యాపారాలలో ధనలాభం కలుగుతుంది. ఉద్యోగంలో ఉన్నత స్థితి ఏర్పడుతుంది. తలచిన పనులు సకాలంలో పూర్తవుతాయి.శారీరక సుఖం లభిస్తుంది.బంధుమిత్రుల సహాయ సహకారాలు అంది వస్తాయి.ఓం శంకరాయ నమః అనే జపించండి శుభ ఫలితాలను పొందండి. కుంభం (ధనిష్ట 3 4, శతభిషం పూ.భాద్ర 1 2 3) నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా) తారాబలం శతభిషం నక్షత్రం వారికి (సంపత్తార)వృత్తి వ్యాపారంలో ధన లాభం.నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు.శుభవార్తలు వింటారు పూ.భా నక్షత్రం వారికి (జన్మతార) అధికారులు తో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.. దిన ఫలం:-వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది. బంధు మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. రావలసిన బాకీలు చేతికి అందుతాయి.నూతన కార్యాలకు శ్రీకారం చేస్తారు.ఓం విజయలక్ష్మి యై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి . మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర రేవతి ) నామ నక్షత్రాలు (దీ-దూ-ఝ-దా-దే-దో-చా-చి) తారాబలం ఉ.భాద్ర నక్షత్రం వారికి (పరమమిత్ర తార)వ్యవహారాల్లో ఆటంకములు. అకారణ కలహాలు.శారీరక బాధలు.ధన నష్టము. రేవతి నక్షత్రం వారికి (మిత్ర తార)శుభ కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. వృత్తి వ్యాపారంలో అధిక ధనాదాయం లభించును.నూతన పరిచయం. దిన ఫలం:-ఉద్యోగాలలో అధికారుల తో సమస్యలు ఏర్పడును. వ్యాపారాల్లో ప్రతిబంధకాలు ఏర్పడకుండా చూసుకోవాలి.ఇతరుల విషయాల్లో జోక్యం తగదు.బంధుమిత్రులతో మనస్పర్థలు రాగలవు. దుష్ట సహవాసాలు కు దూరంగా ఉండాలి.అనవసరమైన ఆలోచనలు.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.ఓం మహేశ్వరాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
- Today Panchangam: నేటి శుభకాలం తెలుసుకోండి..!on March 18, 2024 at 11:00 pm
Today Panchangam: తెలుగు పంచాంగం ప్రకారం.. 19 మార్చి 2024 మంగళవారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి. పంచాంగం తేది :- 19మార్చి 2024 శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్ల పక్షం మంగళవారం తిథి :- దశమి తె.3:03 ని॥వరకు నక్షత్రం :- పునర్వసు రాత్రి 10:57 ని॥వరకు యోగం:- శోభనం రాత్రి 7:27 ని॥వరకు కరణం:- తైతుల ఉ॥11:45గరజి తె. 3:03 ని॥వరకు అమృత ఘడియలు:- రాత్రి 8:26 ని॥ల 10:06 ని॥వరకు దుర్ముహూర్తం: ఉ॥ 08:33 ని॥ల09:20 ని॥వరకు తిరిగి రా.10:55 ని॥ల11:43 ని॥వరకు వర్జ్యం:- ఉ॥10:23 ని॥ల 12:04 ని॥వరకు రాహుకాలం:- మ॥ 03:00 ని॥ల 04:30 ని॥వరకు యమగండం:- ఉ॥.9.00. ని॥ల10:30 ని॥వరకు సూర్యోదయం :- 06:10ని॥లకు సూర్యాస్తమయం:- 06.06ని॥లకు తారాబలం లో జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార దోష ప్రదమైన తారలు మీ నక్షత్రానికి ఉన్న తారాబలం ఫలితాలు చూసుకొని వ్యవహరించడం మంచిది.
- కొప్పుల ఈశ్వర్ : బాల్యం, విద్య, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం..on March 18, 2024 at 10:40 pm
Koppula Eshwar Biography: ఉద్యోగంలోనూ.. రాజకీయ ప్రస్థానంలోనూ నమ్ముకున్న సూత్రాన్ని ఎక్కడ వదిలిపెట్టలేదని నాయకుడు. నమ్మిన సిద్ధాంతం కోసం.. నమ్మిన వ్యక్తి కోసం.. ఎంతటి కష్టానైనా ఇష్టంగా స్వీకరించే నేత. తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచే క్రియాశీలక పాత్ర పోషించిన ఉద్యమకారుడు. ప్రజా సమస్యల పరిష్కారమే ఆయన లక్ష్యంగా.. ఎవరికి ఏ ఆపద వచ్చినా నేనున్నానంటూ భరోసా నేత. సింగరేణి కార్మికుల నుంచి ప్రభుత్వ చీఫ్ వరకు ఎదిగిన ప్రజ్ఞాశాలి ధర్మపురి మాజీ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్. వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా.. ఇటీవల జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. కొప్పుల ఈశ్వర్ జీవిత, రాజకీయ ప్రస్థానం మీకోసం.. కొప్పుల ఈశ్వర్ బాల్యం, విద్యాభ్యాసం పోరాటాల పురిటి గడ్డ కరీంనగర్ జిల్లాలోని జూలపల్లి మండలం కుమ్మరి కుంట గ్రామంలో 1959 ఏప్రిల్ 24న మల్లమ్మ – లింగయ్య దంపతులకు జన్మించారు కొప్పుల ఈశ్వర్. ఆయన తన తండ్రి సింగరేణి ఉద్యోగి కావడంతో గోదావరిఖనిలో సెటిల్ అయ్యారు. కొప్పుల ఈశ్వర్ చదువు మొత్తం గోదావరిఖనిలో సాగింది. బిఏ డిగ్రీ వరకు చదువుకున్న కొప్పుల ఈశ్వర్ సింగరేణి కార్మికుడిగా 27 సంవత్సరాలపాటు పని చేశారు. ఉద్యోగం చేస్తున్న ఎక్కడో చిన్న అసంతృప్తి తన చుట్టూ ఉన్న వాళ్ళు కష్టాల్లో ఉంటే చూస్తూ ఉండవలసి వస్తుంది . గడిచిపోతున్న ఆయనను రాజకీయాల వైపు అడుగులు వేయించింది రాజకీయ ప్రవేశం 1983లో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడంతో కొప్పుల ఈశ్వర్ కూడా రాజకీయాల వైపు అడుగులు వేస్తారు. తన అభిమాన నేత పెట్టిన టీడీపీ పార్టీలో చేరి.. ఎస్సీసెల్ బాధ్యతలు చేపట్టారు. ఆయన 1994లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మేడారం శాసనసభ నియోజకవర్గ నుంచి పోటీచేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆ తరువాత 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావంతోనే ఆ పార్టీలో చేరి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. మాతంగ్ నర్సయ్య పదవీ విరమణ చేయడంతో 2004లో కాంగ్రెస్ పార్టీ పొత్తు భాగంగా టిఆర్ఎస్ అభ్యర్థిగా మేడారం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఘనవిజయం సాధించారు. ఆ తరువాత కేసీఆర్ పిలుపు మేరకు 2008లో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇదే సంవత్సరం జరిగిన ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యే గారి గెలిచి తన సత్తా ఏంటో చాటుకున్నారు. విభజనలో మేడారం స్థానం రద్దు కావడంతో 2009లో కొత్తగా ఏర్పడ్డ ధర్మపురి శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2010 ఉపఎన్నికల్లో ధర్మపురి నుంచి తిరిగి ఎన్నికయ్యారు. ఇలా 2004 నుంచి 2018 వరకు సాధారణ, ఉప ఎన్నికలతో కలుపుకొని వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన కొప్పుల సాధించారు. కానీ, 2023లో జరిగిన తెలంగాణ శాసససభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరుపున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై ఓటమి పాలయ్యారు. అయితే.. మాజీ సీఎం ఆదేశాల మేరకు ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. స్వీకరించిన పదవులు >> సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్లో 26 ఏళ్లపాటు పనిచేసిన ఆయన 2014 నుంచి 2018 వరకు ప్రభుత్వ చీఫ్విప్గా పనిచేశారు. >> షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, గిరిజన సంక్షేమం, BC సంక్షేమం, మైనారిటీ సంక్షేమం, వికలాంగుల సంక్షేమం, సీనియర్ సిటిజన్స్ సంక్షేమ మంత్రిత్వ శాఖలలో సేవలందించారు. >> 2019 నుంచి 2023 వరకు కేసీఆర్ కేబినెట్ మంత్రిగా వ్యవహరించారు. కొప్పుల ఈశ్వర్ బయోడేటా.. పేరు: కొప్పుల ఈశ్వర్ జననం: 20 ఏప్రిల్ 1959 స్వస్థలం:గోదావరిఖని. రాజకీయ పార్టీ: బీఆర్ఎస్ తల్లిదండ్రులు: కొప్పులమల్లమ్మ – లింగయ్య నివాసం: కరీంనగర్ వెబ్సైట్: https://koppulaeshwar.officialpress.in/
- అనిల్ కుమార్ యాదవ్ : బాల్యం, విద్య, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం.. on March 18, 2024 at 9:52 pm
Anil Kumar Yadav Biography: బాల్యం, విద్యాభ్యాసం: పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ .. 1980 మార్చి 23న తిరుపాలయ్య, శైలిజా దంపతులకు నెల్లూరు జిల్లా అంబాపురంలో జన్మించారు. తల్లిదండ్రులు, బాబాయి గ్రామస్థాయి రాజకీయాలలో పంచాయితీ ప్రెసిడెంట్లు గా పనిచేశారు. ఆయన పుట్టింది నెల్లూరు అయినా.. విద్యాభ్యాసం చైన్నైలో సాగింది. ఫస్ట్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు చెన్నైలోని వెంగల సుబ్బారావు స్కూల్లో చదివించారు. తరువాత ఇంటర్ రత్నం జూనియర్ కాలేజీలో చదివించారు. తన తండ్రి కోరిక మేరకు డాక్టర్ అవ్వాలని MGR యూనివర్సిటీలోని SRM డెంటల్ కాలేజ్ బీడీఎస్ పూర్తి చేశారు. తాను డెంటల్ స్పెషలిస్ట్ గా చేసిన ప్రాక్టీస్ మాత్రం పెద్దగా చేయలేదు. రాజకీయ జీవితం అనిల్ కుమార్ యాదవ్ బాబాయి సుధాకర్ మృతితో రాజకీయాల్లోకి వచ్చాడు. 2008లో అనూహ్యంగా రాజకీయ ప్రవేశం చేసిన ఆయన వెనుదిరిగి చూడలేదు. అప్పటి కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్గా తన రాజకీయ ప్రస్తానం ప్రారంభించారు. వీరి కుటుంబానికి ఆనం సోదరుల కుటుంబానికి మొదటి నుంచి సన్నిహిత సంబంధాలు ఉండేవి. దీనికి తోడు 2008లో నెల్లూరు రెండు సెగ్మెంట్లుగా విడిపోయింది. ఒక సిగ్మెంట్ కి బీసీలకు టికెట్ ఇవ్వాలని ఆనం బ్రదర్స్ అనుకోవడంతో అలా.. అనిల్ కుమార్ కి కాంగ్రెస్ తరపున వైయస్ హయాంలో 2009లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి పోటీ చేయించారు. కానీ, ఖర్చు అంతా అనిల్ పెట్టుకోవడం అజమానిస్తూ మాత్రం ఆనంద్ సోదరులు చెలాయించడంతో వాళ్లతో కొన్ని విభేదాలు వచ్చాయి. దాంతో ఆనం బ్రదర్స్ వారి మద్దతును ఉపసంహరించుకున్నారు. ఈ ఎన్నికలలో కేవలం 90 ఓట్ల అత్యంత స్వల్ప తేడాతో ఓడిపోయారు. కానీ, అనిల్ నిరాశ చెందకుండా నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేవారు. నెల్లూరు తన సిగ్మెంట్లో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కూడా ఓపెన్ చేసి తన అనుచరులతో నిత్యం ప్రజల్లోనే ఉండేవాడు. వైసీపీలో చేరిక ఆ తరువాత వైయస్సార్ మరణించడంతో రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. 2011లో జగన్ పెట్టిన వైఎస్ఆర్సిపి లో చేరి జగన్ తో ఇంకా బలమైన అనుచర వర్గాన్ని ఏర్పాటు చేసుకొని వైసిపి తరఫున ఏ కార్యక్రమం జరిగిన ముందుండి చురుకుగా ఉండేవారు. 2012లో వైఎస్ జగన్ జైల్లో పెట్టిన 16 నెలలు నిరసనగా బ్లాక్ అండ్ బ్లాక్ లో తిరిగి జగన్ కు వీరభక్తుడయ్యాడు. ఆ తర్వాత 2014లో వైసిపి తరపున నెల్లూరు నుంచి పోటీ చేసి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సపోర్టుతో టిడిపి అభ్యర్థి పై 19,500 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. ఇలా 2014లో మొదటి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తరువాత 2019 ఎలక్షన్స్ లో నారాయణ పై అత్యధిక మెజార్టీతో గెలుపొంది వైసీపీలో మంత్రి స్థాయి నాయకుడు అయ్యారు. తన అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ నటించిన జానీ సినిమా తొమ్మిది సార్లు చూసానని చెప్పుకునే ఆయన ప్రస్తుత్తం పవన్ కళ్యాణ్ ని తీవ్రంగా విమర్శింస్తున్నారు. నెల్లూరు సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను 2024 ఎన్నికల్లో నరసరావుపేట లోక్ సభ స్థానం నుంచి బరిలో దించారు వైఎస్ జగన్. మరీ ఈ ఎన్నికల్లో అనిల్ విజయం సాధించేనా? లేదా? వేచి చూడాలి. అనిల్ కుమార్ బయోడేటా.. పేరు: పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ జననం: 1980 మార్చి 23 (వయసు 44) స్వస్థలం: కొత్తూరు, అంబాపురం, నెల్లూరు జిల్లా. రాజకీయ పార్టీ: YSR కాంగ్రెస్ తల్లిదండ్రులు: పోలుబోయిన తిరుపాలయ్య , శైలమ్మ జీవిత భాగస్వామి: జాగృతి సంతానం : పాప సమన్వి , బాబు ధర్మనందన్ నివాసం: నెల్లూరు జిల్లా
- కొడాలి నాని: బాల్యం, విద్య, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం on March 18, 2024 at 7:04 pm
Kodali Nani Biography: కొడాలి నాని.. 1971 అక్టోబర్ 22న కృష్ణాజిల్లాలోని గుడివాడలో కొడాలి అర్జున్ రావు దంపతులకు జన్మించారు. కొడాలి నాని అసలు పేరు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు.ఆయన చిన్నప్పటి నుంచి దూకుడుగా ప్రవర్తించేవారు. చదువుపై అంతగా శ్రద్దగా లేకపోవడంతో 10వ తరగతి వరకు చదివి ఆపేశారు. రాజకీయ కుటుంబం కావడంతో చిన్ననాటి నుంచి చదువు కంటే రాజకీయాలపై ఆసక్తి చూపేవారు. అలాగే ఎన్టీఆర్ అంటే ఆయనకు ఎంతో ఇష్టం. ఇక తన అభిమాన నటుడు పార్టీ స్థాపించడంతో వెంటనే టిడిపి కార్యకర్తగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. నిజంగా టిడిపి జెండా కనబడితే పూనకాలు వచ్చినట్టు ఊగిపోయేవారు. తెలుగుదేశం తరఫున ఎటువంటి ర్యాలీ జరిగిన ఆయనే ముందుండి నడిపించేవారు. రాజకీయ జీవితం ఇక ఎన్టీఆర్ గుడివాడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారో అప్పటినుంచి ఎన్టీఆర్ కి చాలా దగ్గరయ్యారు. ఈ క్రమంలోనే నందమూరి హరికృష్ణతో పరిచయం ఏర్పడింది. ప్రతి విషయంలోనూ హరికృష్ణ కి చేదోడు వాదోడుగా ఉండి ఆయనకి బాగా దగ్గరయ్యారు. ఎంతగా అంటే.. నందమూరి కుటుంబంలో ఒక సభ్యుడిగా మెలిగారు. జూనియర్ ఎన్టీఆర్ కి ఒక అన్నయ్యల వ్యవహరించేవారు. జూనియర్ ఎన్టీఆర్ సినీ జీవితంలో కూడా ఎంతో సహాయం చేశారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఏర్పడిన స్నేహంతో జూనియర్ ఎన్టీఆర్ ని పెట్టి సాంబ సినిమా తీశారు. అయితే ఈ సినిమాతో వాళ్ళకు ఆశించిన ఫలితం రాలేదు. దాంతో సినిమాలు మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదని చెప్పాలి. రాజకీయం మీద ఇష్టం ఉండడంతో హరికృష్ణ ప్రాద్బలంతో కృష్ణ జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా అవకాశం వచ్చింది. అందుకే హరికృష్ణను తన రాజకీయ గురువు అని సంభోదిస్తారు. తరువాత 2004లో హరికృష్ణ సపోర్ట్ తో తెలుగుదేశం తరఫున గుడివాడ శాసనసభ స్థానంలో పోటీ చేసే అవకాశం వచ్చింది. అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని ఆ టికెట్ నానికి ఇవ్వడంతో అప్పట్లో పెద్ద దుమారమే అయ్యింది. ఆ విధంగా 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కటారి ఈశ్వర్ కుమార్ పై భారీ మెజార్టీతో మొదటిసారి విజయం సాధించి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. తన మాట తీరు.. తన ప్రవర్తన తో అప్పటి సీఎం చంద్రబాబుకు కూడా చాలా దాంతో 2009లో కూడా గుడివాడ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి పెన్నమనేని వెంకటేశ్వరరావు మీద విజయం సాధించి రెండవసారి గెలిచారు. అయితే 2009 తర్వాత జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణని పార్టీ నుంచి చంద్రబాబు దూరం పెడుతూ వచ్చారు. దీంతో చంద్రబాబుతో రాజకీయంగా కూడా కొన్ని విభేదాలు రావడంతో 2012 టిడిపి సభ్యత్వానికి రాజీనామా చేసి.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీలో చేరారు. ఇది అప్పట్లో రాజకీయంగా పెద్ద దుమారమే లేపింది. ఆ తరువాత 2014లో వైసీపీ తరఫున పోటీ చేయడంతో నానిని ఎలాగైనా ఓడించాలని చంద్రబాబు .. విశ్వ ప్రయత్నాలు చేశాడు. కానీ ఆ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి పై ముచ్చటగా మూడోసారి కూడా విజయం సాధించారు. గుడివాడ గడ్డ కొడాలి నాని అడ్డా అనేలా నిరూపించుకున్నారు. ఆయన పార్టీలతో సంబంధం లేదు నిత్యం గుడివాడ ప్రజలకి అందుబాటులో ఉంటూ వ్యక్తిగతంగా ఓటు బ్యాంకు ని సంపాదించుకున్నారు. తెలుగుదేశం కంచుకోటగా ఉన్న గుడివాడ నేడు కొడాలి నాని కంచుకోటగా మారిందంటే తన కృషి ఎంతో ఉందని చెప్పాలి. 2014లో తాను గెలిచిన తన పార్టీ అధికారంలోకి రాలేదు. దాంతో ఆయన ప్రతిపక్షంలో ఉంటూ తెలుగుదేశం నాయకులపై ముఖ్యంగా చంద్రబాబుని టార్గెట్ చేసి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2019 ఏప్రిల్ నెలలో వైసీపీ తరఫున పోటీ చేసి నన్ను ఓడించేవాడు గుడివాడలో పుట్టలేదని సంచలన వ్యాఖ్యలు చేసి టిడిపి అభ్యర్థి దేవినేని అవినాష్ పై అఖండ విజయం సాధించారు. ఇలా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కొడాలి నాని బయోడేటా.. అసలు పేరు: కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు మారుపేరు: కొడాలి నాని వృత్తి: రాజకీయ నాయకుడు భార్య పేరు: పుట్టిన తేది: అక్టోబర్ 22, 1971 పుట్టిన ప్రదేశం: ష్ణా జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ తండ్రి పేరు: అర్జున్ రావు తల్లి పేరు: కులం: కమ్మ మతం: హిందూ
- వారాల ఆనంద్ కవిత : నా కన్నీ గుర్తే..on March 18, 2024 at 6:15 pm
వరమో శాపమో ఎందుకోమరి నాకన్నీ గుర్తుంటాయి అలలు అలలుగా లోనెక్కడో ప్రవహిస్తాయి సుళ్ళు తిరుగుతాయి ఉప్పొంగుతాయి సల్లబడతాయి సుఖాలూ దుఃఖాలూ అభినందనలూ అవమానాలూ ఆదరణ నిరాదరణ అన్నీ అన్నీ మెదుళ్తూనే వుంటాయి మనసులో మెసుళ్తూనే వుంటాయి నిజమే మరి నేనేమీ పిల్లాడి చేతిలో ‘పలక’ను కాను అ..ఆ.. లు దిద్ది పాత బట్టతో తుడిచేస్తే మలిగి పోవడానికి మరుపు ఒక వరం కదా అన్నారెవరో జ్ఞాపకం ఒక శిక్ష అని కూడా అన్నారు కానీ , వర్షానికి చెత్తా చెదారం కొట్టుకు పోయినట్టు కాలప్రవాహానికి ఏదీ చెరిగిపోవడం లేదు కనీసం ధారగా పారే కన్నీళ్ళకీ కరగడం లేదు శిలలమీద చెక్కిన పురా రాతల్లా నిలబడే వుంటున్నాయి అవును మంచీ చెడూ గెలుపూ ఓటమీ మనసు పొరల్లో మరుగున పడడమే లేదు నాకన్నీ గుర్తే వుంటున్నాయి
- ‘టిల్లు స్క్వేర్’ నుంచి థమన్ తప్పుకోవడానికి అసలు కారణం ఇదే!on March 18, 2024 at 5:23 pm
నాగవంశీ నిర్మించిన ‘డీజే టిల్లు’కు సీక్వెల్ వస్తున్న విషయం తెలిసిందే. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ Jonnalagadda హీరోగా, అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరోయిన్ గా ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square) రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరో పదిరోజుల్లో మూవీ గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా యూనిట్ ప్రచార కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉంది. బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ను వదులుతూ సినిమాపై మరింత ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తున్నారు. తాజాగా ‘హో మై లిల్లీ’ సాంగ్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. కార్యక్రమంలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడారు. అయితే మొదట ఈ చిత్రానికి థమన్ (Thaman) నుంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను కోరారు. ఆయన కూడా ఒప్పుకున్నారు. కానీ తర్వాత థమన్ కు బిజీ షెడ్యూల్స్ వల్ల ఈ సినిమాకు వర్క్ చేయలేకపోయారు. ఆయన స్థానంలో భీమ్స్ సిసిరోలియోను తీసుకున్నామని నిర్మాత క్లారిటీ ఇచ్చారు. సినిమాను సమయానికి ప్రేక్షకులకు అందించాలనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఇక థమన్ చివరి ‘గుంటూరు కారం’ సాంగ్స్ తో దుమ్ములేపారు. నెక్ట్స్ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’తో ఆకట్టుకోబోతున్నారు.
- ‘టిల్లు స్క్వేర్’లో బోల్డ్ సీన్లు.. ఏంటని అడిగితే.. ఇంకా బోల్డ్ గా ఆన్సర్ ఇచ్చిన అనుపమా.. షాకింగ్ కామెంట్స్!on March 18, 2024 at 4:51 pm
యంగ్ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) బోల్డ్ పెర్ఫామెన్స్ తోనే కాదు.. బోల్డ్ గానూ మాట్లాడుతూ షాకిస్తోంది. ఆమె లేటెస్ట్ కామెంట్స్ వైరల్ గా మారాయి. మలయాళ బ్యూటీ, టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ వరుసగా హిట్లు అందుకుంటూ వస్తోంది. మరోవైపు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతోనూ సందడి చేస్తోంది. సినిమాల విషయంలో ఇటీవల మరింత జోరు పెంచింది. టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన కొత్తలో ఈ ముద్దుగుమ్మ చాలా పద్ధతిగా మెరిసి ఆకట్టుకుంది. సంప్రదాయంగా కనిపిస్తూ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. మరోవైపు హ్యాట్రిక్ హిట్ ను కూడా అందుకుంది. ఆ తర్వాత హిట్లు లేకపోవడంతో రూటు మార్చుకుంది. బోల్డ్ పెర్ఫామెన్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వచ్చింది. తన కెరీర్ లోనే ‘రౌడీ బాయ్స్’ చిత్రంలో ఫస్ట్ లిప్ లాక్ పెట్టి షాకిచ్చింది. ఆ తర్వాత నుంచి ఈ ముద్దుగుమ్మ ఫొటోషూట్లు కూడా ఫ్యూజులు ఎగిరిపోయేలా ఉన్నాయి. ఇలా తన పద్ధతి మొత్తం మార్చుకుంటూ వచ్చింది. ఇక ప్రస్తుతం ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square)తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda)తో రోమాన్స్ లో రెచ్చిపోయింది. ఇప్పటికే ‘టిల్లు స్క్వేర్’ నుంచి వచ్చిన ప్రమోషనల్ మోటీరియల్ లో ఈ ముద్దుగుమ్మ బోల్డ్ పెర్ఫామెన్స్ కు అంతా షాక్ అవుతున్నారు. మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం నుంచి ఈరోజు ‘హో మై లిల్లీ’ (Oh my Lilly) అనే సాంగ్ విడుదలైంది. తన బోల్డ్ పెర్ఫామెన్స్ పై స్పందించింది. ’రోజూ అన్నమే తినలేం కదా.. ఓ బిర్యానీ, పుల్వా కావాలి.. డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ కావాలి… అయితే డైరెక్టర్ నాకు ఇచ్చిన డ్యూటీని పూర్తి చేయడం నా బాధ్యత.. అందుకే అలా చేశాను.’ అంటూ చెప్పుకొచ్చింది.
- కోడూరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024on March 18, 2024 at 4:25 pm
అన్నమయ్య జిల్లా కోడూరు రాజకీయాలు ఎప్పుడూ ప్రత్యేకంగా వుంటాయి. శేషాచలం కొండలను ఆనుకుని వుండే ఈ నియోజకవర్గంలో ప్రత్యేక పరిస్ధితులు నెలకొన్నాయి. 1962లో ఏర్పడిన కోడూరులో ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ 4 సార్లు, టీడీపీ ఐదు సార్లు, వైసీపీ మూడు సార్లు , ఇతరులు మూడు సార్లు విజయం సాధించారు. ఎస్సీ నియోజకవర్గమైన కోడూరులో 2,01,660 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 99,463 మంది పురుషులు కాగా.. 1,02,180 మంది మహిళలు. ఈ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో పెనగలూరు, చిట్వేల్, పుల్లంపేట, ఓబుళవారిపల్లె, రైల్వే కోడూరు మండలాలున్నాయి. ఈ నియోజకవర్గం 1999 వరకు టీడీపీకి కంచుకోటగా వుండేది. అలాంటి పార్టీ ఇక్కడ గెలిచి దాదాపు 25 ఏళ్లు గడుస్తోంది. వరుసగా ఐదు సార్లు కోడూరు ప్రజలు తెలుగుదేశం పార్టీని తిరస్కరిస్తూనే వస్తున్నారు. కోడూరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 .. టీడీపీకి వరుస పరాభవాలు : కోడూరులో గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన సరస్వతి టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేశారు. గుంటి శ్రీరాములు, తూమాటి పెంచలయ్యలు రెండేసి సార్లు ఎమ్మెల్యేలుగా పనిచేశారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన కోరుముట్ల శ్రీనివాసులు అనంతర కాలంలో జగన్ వెంట నడిచారు. ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో 2012లో కోడూరులో ఉపఎన్నిక వచ్చింది. ఈ ఎన్నికలో గెలిచిన శ్రీనివాసులు.. 2014, 2019లలో వైసీపీ అభ్యర్ధిగా విజయం సాధించారు. కోడూరు శాసనసభ ఎన్నికల ఫలితాలు 2024 .. టీడీపీ జైత్రయాత్రకు బ్రేక్ వేసిన వైఎస్ : 2024 ఎన్నికల విషయానికి వస్తే రైల్వే కోడూరులో విజయాలను కంటిన్యూ చేయాలని జగన్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోరుముట్ల శ్రీనివాసులకే మరోసారి టికెట్ ఖరారు చేశారు. జగన్ ఛరిష్మా, తనకున్న క్లీన్ ఇమేజ్ కారణంగా మరోసారి విజయం సాధిస్తానని శ్రీనివాసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ విషయానికి వస్తే.. ఒకప్పుడు కోడూరు ఆ పార్టీకి కంచుకోటగా నిలిచింది. ఉమ్మడి కడప జిల్లాలోనే తెలుగుదేశం పార్టీకి మంచి పట్టున్న ప్రాంతంగా వర్ధిల్లింది. 1983 నుంచి 1999 వరకు సైకిల్ జోరుగా దూసుకెళ్లింది. కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కోడూరులో ప్రత్యేకంగా దృష్టి పెట్టడంతో 2004లో టీడీపీ ఓటమి పాలై నాటి నుంచి కోలుకోలేకపోయింది. చంద్రబాబు నాయుడు ఎంతగా వ్యూహాలు రచిస్తున్నా కోడూరులో మాత్రం గెలుపు సాధ్యం కావడం లేదు. ఈసారి జనసేన, బీజేపీలతో పొత్తులతో వుండటంతో ఆ పార్టీల ఓట్లు టీడీపీకి పడతాయని చంద్రబాబు భావిస్తున్నారు.
- ‘అందమే కాదు… అదృష్టం కూడా ఉండాల్సిందేనేమో’! శ్రద్ధా దాస్ లేటెస్ట్ లుక్ పై కామెంట్స్!on March 18, 2024 at 4:16 pm
టాలీవుడ్ నటి శ్రద్ధా దాస్ (Shraddha Das) లేటెస్ట్ లుక్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కానీ కొందరు అభిమానులు మాత్రం ఆమె లేటెస్ట్ పోస్ట్ పై ఇలా స్పందిస్తున్నారు. బ్యూటీఫుల్ హీరోయిన్ శ్రద్ధా దాస్ ఫిట్ నెస్ విషయంలో, అందం విషయంలో రోజురోజుకు మరింతగా ఆకట్టుకుంటోంది. తన లేటెస్ట్ లుక్స్ తో ఫ్యాన్స్, నెటిజన్లను కట్టిపడేస్తోంది. ఈక్రమంలో తాజాగా మరిన్ని బ్యూటీఫుల్ ఫొటోలను అభిమానులతో పంచుకుంది. అయితే ఓ హోటల్ ను సందర్శించిన సందర్భంగా అదిరిపోయేలా ఫొటోషూట్ చేసింది. ట్రెడిషనల్ లుక్ లో మెరిసి మంత్రముగ్ధులను చేసింది. వయస్సు పెరుగుతున్నా మరింత యంగ్ లుక్ తో ఆకర్షిస్తోంది. అలాగే తన ఫొటోషూట్లతో లేటెస్ట్ ఫ్యాషన్ ను కూడా పరిచయం చేస్తోంది. అయితే శ్రద్దా దాస్ లేటెస్ట్ లుక్ తో ఫ్లడ్ లైట్ లా వెలిగిపోతోంది. తన అందం యంగ్ హీరోయిన్లకు పోటీనిచ్చేలా ఉంది. ఈ క్రమంలో ఫొటోషూట్ ను నెటిజన్లు లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. కొందరు అభిమానులు మాత్రం శ్రద్ధా దాస్ కున్న అందానికి కాస్తా అదృష్టం కూడా తోడై ఉంటే.. ఈపాటికి స్టార్ హీరోయిన్ గా దుమ్ములేపేదని అంటున్నారు. ఇప్పటికైనా ఆమె దశతిరగాలని కోరుకుంటున్నారు. కెరీర్ తొలినాళ్లలో శ్రద్ధా దాస్ కూడా స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరిపోవడానికి ఎంతో కృషి చేశారు. కానీ పెద్దగా హిట్లు లేకపోవడంతో అలాఅలా కెరీర్ సాగించింది. ప్రస్తుతం మాత్రం విభిన్న పాత్రలతో అలరిస్తోంది. ప్రస్తుతం ‘పారిజాత పర్వం’, ‘అర్ధం’ వంటి సినిమాల్లో నటిస్తోంది.
- లోక్ సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది: మాజీ సీఎంon March 18, 2024 at 3:58 pm
పార్లమెంటరీ ఎన్నికలు ముగిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చీలిపోతుందని కర్ణాటక మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై అన్నారు. పార్టీ చీలిక ప్రభుత్వంపై తీవ్ర ప్రభావం వేస్తుందని అన్నారు. అంతర్గత కలహాల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం మనలేదని అభిప్రాయపడ్డారు. కాబట్టి, లోక్ సభ ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుందని అన్నారు. సోమవారం గడగ్లో మీడియాతో ఆయన మాట్లాడారు. సిట్టింగ్ ఎంపీ శివకుమార్ ఉదాసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేశారని అన్నారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ మూడోసారి పగ్గాలు పట్టడం ఖాయం అని పేర్కొన్నారు. గడగ్, హవేరీ లోక్ సభ నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు ఎంతో ఉత్సాహంతో పని చేస్తున్నారని వివరించారు. మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై ఈ సారి లోక్ సభ ఎన్నికల బరిలో నిలబడుతున్నారు. గడగ్ హవేరీ లోక్ సభ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్ పై ఆయన పోటీ చేస్తున్నారు. అయితే.. ఆ స్థానం ఆశించి భంగపడ్డ కేఎస్ ఈశ్వరప్ప పార్టీ కోసం పని చేస్తారని అన్నారు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నదని, ఇంతలో ఆయన సర్దుకుంటారని వివరించారు.
- కడప అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024on March 18, 2024 at 3:37 pm
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉమ్మడి రాష్ట్రమైనా, నవ్యాంధ్ర అయినా కడప చుట్టూనే తిరుగుతాయి. దేశానికి, రాష్ట్రానికి ఉద్ధండులైన నేతలను అందించింది ఈ గడ్డ. వైఎస్ కుటుంబానికి కంచుకోట లాంటి ఈ నియోజకవర్గంపై సీఎం జగన్ దృష్టి సారించారు. పులివెందుల, కడప జగన్ ఫ్యామిలీకి రెండు కళ్లలాంటివన్న సంగతి రాష్ట్రంలో అందరికీ తెలిసిందే. అందుకే రాజకీయాల్లో , పాలనలో ఎంత బిజీగా వున్నా ఈ రెండు నియోజకవర్గాలకు ప్రత్యేక బాధ్యులను నియమించి ఎప్పటికప్పుడు ఓ కన్నేసి వుంచుతారు జగన్. కడప అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024.. 30 ఏళ్లుగా మైనారిటీలదే విజయం : 1952లో కడప నియోజకవర్గం ఏర్పడగా.. కాంగ్రెస్ పార్టీ 8 సార్లు, టీడీపీ నాలుగు సార్లు, వైసీపీ రెండు సార్లు విజయం సాధించాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపన తర్వాత కడపలో జగన్ పార్టీ ఓడిపోలేదు. ఈ సెంటిమెంట్ను కంటిన్యూ చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. రెడ్డి, ముస్లిం మైనారిటీ, దళిత వర్గాలు కడపలో అభ్యర్ధుల గెలుపొటములను శాసిస్తున్నారు. కడప అసెంబ్లీ నియోజకవర్గంలో మైనారిటీలు అత్యధికంగా 8 సార్లు విజయం సాధించారంటే వారికి ఇక్కడనున్న పట్టును అర్ధం చేసుకోవచ్చు. 1994 నుంచి నేటి వరకు కడపలో అన్ని పార్టీలు ముస్లింలకే టికెట్ను కేటాయిస్తూ వస్తుండగా వారే గెలుస్తున్నారు. కడప నుంచి అంజాద్ భాషా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయన డిప్యూటీ సీఎంగా, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. వైసీపీ తరపున 2014, 2019 ఎన్నికల్లో భాషా గెలుపొందారు. కడప శాసనసభ నియోజకవర్గంలో 2,65,154 మంది ఓటర్లున్నారు. కడప నగరం మొత్తం ఈ సెగ్మెంట్ పరిధిలోకి వస్తుంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి అంజాద్ భాషాకు 1,04,822 ఓట్లు.. టీడీపీ అభ్యర్ధి అమీర్ బాబుకు 50,028 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా వైసీపీ 54,794 ఓట్ల తేడాతో కడపను దక్కించుకుంది. కడప శాసనసభ ఎన్నికల ఫలితాలు 2024 .. పాగా వేయాలని టీడీపీ యత్నాలు : కడపను నిలబెట్టుకోవాలని జగన్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అంజాద్ భాషాకే టికెట్ కేటాయించారు. నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీ వర్గాల్లో వున్న పలుకుబడి, నగరాభివృద్ధి కార్యక్రమాలు, జగన్ ఛరిష్మా తనను మరోసారి గెలిపిస్తాయని అంజాద్ భాషా గట్టి ధీమాతో వున్నారు. టీడీపీ విషయానికి వస్తే .. ఆ పార్టీ ఇక్కడ గెలిచి పాతికేళ్లు అవుతోంది. 1999లో చివరిసారిగా తెలుగుదేశం పార్టీ కడపలో విజయం సాధించింది. గతంలో వైఎస్ఆర్, ఇప్పుడు వైఎస్ జగన్లు కడపలో టీడీపీ అడుగుపెట్టకుండా నిలువరించగలిగారు. కానీ ఈసారి ఎలాగైనా కడప గడ్డపై పసుపు జెండా రెపరెపలాడించాలని చంద్రబాబు భావిస్తున్నారు. దీనిలో భాగంగా కడపలో మహిళా అభ్యర్ధిని రంగంలోకి దించారు. మూడు దశాబ్ధాలుగా ఇక్కడ ముస్లిం మైనారిటీలే గెలుస్తున్నప్పటికీ.. ఈసారి మాత్రం చంద్రబాబు ప్రయోగం చేసి రెడ్డి సామాజికవర్గానికి చెందిన మాధవీ రెడ్డిని అభ్యర్ధిగా ప్రకటించారు. పలుమార్లు సర్వేలు చేయించి.. ఆ ఫలితాలను బట్టే మాధవీ రెడ్డిని ఇన్ఛార్జ్గా ప్రకటించారు. ఆమె టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి సతీమణి కావడం మరో విశేషం. కడపలో శెట్టి బలిజ ఓటర్లు కూడా గణనీయంగా వుండటంతో పవన్ కళ్యాణ్ కారణంగా ఆ ఓట్లు తెలుగుదేశం వైపు మళ్లే అవకాశం వుంది.
- Tollywod Six Pack Heroine : టాలీవుడ్ లో సిక్స్ ప్యాక్ ఉన్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా? గెస్ చేయడం చాలా కష్టంon March 18, 2024 at 3:27 pm
టాలీవుడ్ నటీమణులు ప్రస్తుతం ఎంత ఫిట్ గా ఉంటున్నారో తెలిసిందే. అయితే తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో పరిచయం ఉన్న ఒకే ఒక్క హీరోయిన్ సిక్స్ ప్యాక్ ను సాధించింది. సినిమా పరిశ్రమలో ఎక్కువకాలం ఉండాలంటే హీరోలకు హిట్లు కావాలి… ఇక హీరోయిన్లు మాత్రం గ్లామర్ తో పాటు ఫిట్ నెస్ తప్పనిసరి అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాప్ హీరోయిన్లను గమనిస్తే వారి డైలీ రోటీన్ లో జిమ్, వర్కౌట్స్ తప్పనిసరిగా ఉంటాయి. ఎప్పుడూ ఫిట్ గా కనిపించేందుకు టాలీవుడ్ తారలు జిమ్ ల్లో శ్రమిస్తున్న విషయం మనకు తెలిసిందే. సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu), రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh), తమన్నా భాటియా, శ్రియా శరణ్ (Shriya Saran) తో పాటు మరికొందరు హీరోయిన్లు జిమ్ ల్లో దర్శనమిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఫిట్ నెస్ పై ఫోకస్ పెట్టిన హీరోయిన్లు, యంగ్ బ్యూటీలు నాజుగ్గా తయారయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు పర్ఫెక్ట్ ఏబీఎస్ (ABS)ను సాధించేందుకు కృషి చేస్తున్నారు. కానీ, ఇప్పటి వరకు టాలీవుడ్ లో సిక్స్ ప్యాక్ ను కలిగి ఉన్నది మాత్రం కేవలం తాప్సీ పన్ను (Taapsee Pannu) అని తెలుస్తోంది. అది కూడా గతేడాదే ఈ ముద్దుగుమ్మ తన సిక్స్ ప్యాక్ ను చూపించింది. పర్ఫెక్ట్ ఏబీఎస్ తో తను ఫొటోలకు ఇచ్చిన ఫోజులు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక టాలీవుడ్లో ఇంతలా ప్యాక్స్ చూపించిన హీరోయిన్ లేదనే అంటున్నారు. మరోవైపు ఇప్పుడున్న హీరోయిన్లు, యంగ్ బ్యూటీలు తమ ఫిట్ నెస్ తోనూ ఆశ్చర్యపరుస్తుండటం విశేషం.
- గోవాకు పయనమైన ఎన్టీఆర్… లేటెస్ట్ లుక్ కేక!on March 18, 2024 at 2:40 pm
ఎన్టీఆర్ దేవర షూటింగ్ లో బిజీ బిజీ. సమ్మర్ కి రావాల్సిన దేవర వాయిదా పడింది. దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దేవర లేటెస్ట్ షెడ్యూల్ గోవాలో ప్లాన్ చేశారు. అక్కడ ఒక ఒక యాక్షన్ ఎపిసోడ్ తో పాటు పాట చిత్రీకరించనున్నారట. జాన్వీ కపూర్-ఎన్టీఆర్ లపై డ్యూయట్ ప్లాన్ చేశారని సమాచారం. ఇక గోవాకు వెళుతున్న ఎన్టీఆర్ ఎయిర్ పోర్ట్ లో దర్శనం ఇచ్చాడు. ఆయన లేటెస్ట్ లుక్ వైరల్ అవుతుంది. టీ షర్ట్, జీన్స్ ధరించి ఎన్టీఆర్ సూపర్ స్టైలిష్ గా ఉన్నారు. తన ఫిట్నెస్ ట్రైనర్ తో పాటు ఎన్టీఆర్ గోవా వెళ్లారు. దేవర చిత్రానికి కొరటాల శివ దర్శకుడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడని సమాచారం. ఆయన రెండు భిన్నమైన గెటప్స్ లో కనిపిస్తున్నారు. దేవర చిత్రంలో విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఎన్టీఆర్-జాన్వీ కాంబినేషన్ పై హైప్ నెలకొంది. అలనాటి బ్లాక్ బస్టర్ కాంబినేషన్ ఎన్టీఆర్-శ్రీదేవిల వారసులు జతకట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆర్ ఆర్ ఆర్ అనంతరం ఎన్టీఆర్ నుండి వస్తున్న ఈ చిత్రం మీద అంచనాలు ఏర్పడ్డాయి. దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా చిత్రంగా నిర్మిస్తున్నారు. సాగర తీరం నేపథ్యంలో సాగే ఈ కథలో విజువల్స్ అద్భుతంగా ఉంటాయట. విఎఫ్ఎక్స్ కోసం గట్టిగానే ఖర్చు చేస్తున్నారట. ఎన్టీఆర్ జన్మదినం పురస్కరించుకుని టీజర్ విడుదల చేసే అవకాశం కలదు. దేవర చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఎన్టీఆర్-అనిరుధ్ కాంబోలో ఫస్ట్ మూవీ ఇది. మరోవైపు ఎన్టీఆర్ వార్ 2 చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. హృతిక్ రోషన్-ఎన్టీఆర్ ల మల్టీస్టారర్ గా వార్ 2 తెరకెక్కుతుంది. అయాన్ ముఖర్జీ దర్శకుడు. వార్ 2 అనంతరం ఎన్టీఆర్ కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తో మూవీ చేయనున్నాడు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించారు. ఎన్టీఆర్ క్రేజీ లైనప్ కలిగి ఉన్నాడు.
- రాజంపేట అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024on March 18, 2024 at 2:11 pm
కడపకు కూతవేటు దూరంలో వుండే రాజంపేటలో రాజకీయంగా హాట్ హాట్గా మారింది. దట్టమైన నల్లమల అడవులతో పాటు అపారమైన ఖనిజ సంపదకు , ప్రకృతి రమణీయతకు ఈ నియోజకవర్గం కేంద్రం. 1952లో నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి రాజంపేట కాంగ్రెస్కు కంచుకోట. ఇక్కడ 17 సార్లు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ ఏడు సార్లు, టీడీపీ 4 సార్లు, స్వతంత్రులు మూడు సార్లు, వైసీపీ రెండు సార్లు, సీపీఐ అభ్యర్ధి ఒకసారి విజయం సాధించారు. రాజంపేట అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 … కాపులదే ఆధిపత్యం : కాంగ్రెస్ సీనియర్ నేత, మహిళా నేత ప్రభావతమ్మ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం విశేషం. టీడీపీ నేత పసుపులేటి బ్రహ్మయ్య ఎన్టీఆర్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. కాపు, శెట్టి బలిజ, తెలగ కమ్యూనిటీలు రాజంపేటలో ఆధిపత్యం వహిస్తున్నాయి. ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో సిద్ధవటం, ఒంటిమిట్ట, నందలూరు, రాజంపేట, వీరబల్లె, టీ సుండుపల్లి మండలాలున్నాయి. రాజంపేటలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,37,191 మంది. వీరిలో పురుషులు 1,15,751 మంది.. మహిళలు 1,21,430 మంది. రాజంపేట శాసనసభ ఎన్నికల ఫలితాలు 2024 .. బరిలో నిలిచేదెవరు : 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి మేడా మల్లిఖార్జున రెడ్డికి 95,266 ఓట్లు.. బత్యాల చెంగల్రాయుడు 59,994 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా వైసీపీ అభ్యర్ధి 35,272 ఓట్ల మెజారిటీతో రాజంపేటలో విజయం సాధించారు. 2024 ఎన్నికల విషయానికి వస్తే.. సిట్టింగ్ ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డికి జగన్ టికెట్ నిరాకరించారు. ఆయనకు బదులుగా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిని అభ్యర్ధిగా ప్రకటించారు. మరోవైపు.. టీడీపీకి కూడా రాజంపేటలో బలమైన ఓటు బ్యాంక్ వుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ గెలవాలని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే జనసేన, బీజేపీతో పొత్తు నేపథ్యంలో ఈ సీటును పవన్ కళ్యాణ్ కోరుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కాపు సామాజిక వర్గం ఎక్కువగా వుండటమే అందుకు కారణం. అయితే టీడీపీ తరపున బత్యాల చెంగల్రాయుడు, నరహరిలు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రాజంపేటను జనసేనకు కేటాయిస్తే.. చంద్రబాబు వీరిని ఎలా బుజ్జగిస్తారో చూడాలి.
- RSP: బీఆర్ఎస్లోకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. ‘ప్రత్యేక పరిస్థితుల్లో నిర్ణయం’on March 18, 2024 at 2:05 pm
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ రోజు బీఆర్ఎస్లో చేరారు. మాజీ సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ గూటికి చేరారు. ఎర్రవెల్లి ఫామ్ హౌజ్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొంత మంది నాయకులతో కలిసి కేసీఆర్ నివాసానికి వెళ్లిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్తో బీఎస్పీ పొత్తు ప్రతిపాదన చేశారు. ఇందుకు కేసీఆర్ అంగీకరించారు. మరుసటి రోజు బెహెన్ జీ మాయావతితో మాట్లాడి పొత్తును ఖరారు చేసుకుంటామని పేర్కొన్నారు. బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తులో భాగంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాగర్ కర్నూల్ నుంచి పోటీ చేస్తాడనే ప్రచారం జరిగింది. కానీ, బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తు ముందుకు సాగలేదు. దీంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా పార్టీకి రాజీనామా చేశారు. ఈ రోజు గులాబీ పార్టీలోకి వెళ్లారు. బీఆర్ఎస్లో చేరడానికి ముందు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. తాను ప్రత్యేక పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నట్టు చెప్పారు. ప్యాకేజీ తీసుకుని బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లుతున్నాడని సీఎం రేవంత్ రెడ్డి అక్కసుతో మాట్లాడుతున్నారని అన్నారు. ప్యాకేజీ తీసుకునేవాడి నైతే అధికార పార్టీలో చేరే వాడినని పేర్కొన్నారు. గేట్లు తెరిస్తే వచ్చే గొర్రెల మందలో ఆ ర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉండడు అని అన్నారు.
- ఆ స్టార్ హీరో కోసం రాసిన కథతో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ? బాలయ్య వారసుడు రిస్క్ చేస్తున్నాడే!on March 18, 2024 at 1:54 pm
హీరో బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ పై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఓ స్టార్ హీరోకి రాసిన కథతో లాంచ్ చేస్తున్నారట. ఎన్నికల అనంతరం ఈ మూవీ పట్టాలెక్కనుందట. బాలయ్య ఫ్యాన్స్ మోక్షజ్ఞ రాక కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. సాధారణంగా ఇరవైఏళ్ళ దాటగానే వారసులు రంగంలోకి దిగుతారు. సిల్వర్ స్క్రీన్ పై తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. బాలయ్య టీనేజ్ లోనే నటుడిగా మారాడు. జూనియర్ ఎన్టీఆర్ యంగ్ ఏజ్ లోనే స్టార్ అయ్యాడు. మోక్షజ్ఞ ఏజ్ దాదాపు మూడు పదులకు చేరింది. గత ఐదేళ్లుగా మోక్షజ్ఞ ఎంట్రీ పై వార్తలు వస్తున్నాయి. అవన్నీ పుకార్లుగానే మిగిలిపోతున్నాయి. బాలయ్య ప్రతిసారి త్వరలోనే మోక్షజ్ఞను హీరోగా లాంచ్ చేస్తున్నాం అంటాడు. అవన్నీ మాటలకే పరిమితం అవుతున్నాయి. కార్యరూపం దాల్చడం లేదు. ఆదిత్య 369 సీక్వెల్ సిద్ధం అవుతుంది. ఆ మూవీలో మోక్షజ్ఞ హీరోగా నటిస్తాడు. దర్శకత్వం కూడా నేనో చేయవచ్చని బాలయ్య గతంలో చెప్పాడు. తాజాగా మరో వార్త తెరపైకి వచ్చింది. ఓ స్టార్ హీరోకి రాసుకున్న కథతో దర్శకుడు బోయపాటి శ్రీను మోక్షజ్ఞను లాంచ్ చేయనున్నాడట. ఏపీలో ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందట. దర్శకుడు బోయపాటి శ్రీను అల్లు అర్జున్ కోసం స్క్రిప్ట్ సిద్ధం చేసి చాలా కాలం అవుతుంది. అల్లు అర్జున్ కి ఉన్న కమిట్మెంట్స్ రీత్యా ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అయ్యేలా ఉంది. ఈ క్రమంలో ఆ కథతో మోక్షజ్ఞ హీరోగా మూవీ చేయాలని బోయపాటి భావిస్తున్నారట. ఏపీలో ఎన్నికల హడావుడి ముగిశాక మోక్షజ్ఞ-బోయపాటి శ్రీను మూవీ సెట్స్ పైకి వెళ్లనుందట. అయితే అల్లు అర్జున్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని రాసిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మోక్షజ్ఞకు సెట్ అవుతుందా? అప్పుడే ఇంత పెద్ద భారం మోక్షజ్ఞ మీద మోపడం రిస్క్ తో కూడుకున్న వ్యవహారం అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఇది పుకారు మాత్రమే. ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఇక చూడాలి బాలయ్య తన వారసుడిని ఎలా పరిచయం చేస్తాడో…
- రాజమౌళి – రామ్ చరణ్ బ్లాక్ బాస్టర్ మూవీ… ‘మగధీర’ రీరిలీజ్.. ఎప్పుడో తెలుసా?on March 18, 2024 at 1:48 pm
టాలీవుడ్ లో కొద్దికాలంగా రీరిలీజ్ ల ట్రెండ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరికీ ఒక రోజు ముందే పండగ రాబోతుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసి, తెలుగు వాడి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన చిత్రం మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన, దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన మెగా బ్లాక్ బస్టర్ ‘మగధీర’ (Magadheera) చిత్రం మార్చి 26న థియేటర్లలో రీరిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా డిస్ట్రిబ్యూటర్లు, శ్రీ విజయలక్ష్మి ట్రేడర్స్ అధినేత యర్రంశెట్టి రామారావు, అరిగెల కిషోర్ బాబు మాట్లాడారు. ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో అత్యధిక థియేటర్లలో రెండు తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజ్ చేస్తున్నామన్నారు. మమ్మల్ని ప్రోత్సహించి మాకు రీ రిలీజ్ చేసే అవకాశం కల్పించిన మెగా ప్రొడ్యూసర్ శ్రీ అల్లు అరవింద్ గారికి కృతజ్ఞతలు. తెలుగు ప్రేక్షకులు మెగా అభిమానులు ఈ చిత్రాన్ని ఆదరించి మరోసారి ఘన విజయాన్ని అందించి రామ్ చరణ్ కు బర్త్ డే గిఫ్ట్ ఇస్తారని కోరుకుంటున్నాం అన్నారు. ఇక రామ్ చరణ్ నెక్ట్స్ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అటు జక్కన్న సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ‘ఎస్ఎస్ఎంబీ29’ చిత్రంతో బిజీ కానున్నారు. ఈ సినిమా జూన్ లో అధికారికంగా ప్రారంభం కానుందని తెలుస్తోంది.
- Kalki 2898 Ad : హమ్మయ్యా.. మొత్తానికి ఒక గుడ్ న్యూస్.. ‘కల్కి 2898 ఏడీ’ లేటెస్ట్ అప్డేట్ ఇదే!on March 18, 2024 at 12:49 pm
పాన్ వరల్డ్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 Ad) నుంచి ఓ గుడ్ న్యూస్ అందింది. ఇటీవల సినిమా వాయిదా పడుతుందంటున్న తరుణంలో ఈ న్యూస్ కాస్తా రిలీఫ్ నిస్తోంది. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి పాన్ వరల్డ్ మూవీగా రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ‘మహానటి’ ఫేమ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. భారీ చిత్రం రూ.500 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపుదిద్దుకుంటోంది. టాప్ టెక్నీషియన్లు ఈ చిత్రం కోసం వర్క్ చేస్తున్నారు. ఈ ఏడాది మే 9న రిలీజ్ చేసేందుకు సినిమాను షెడ్యూల్ చేశారు. కానీ ఎన్నికల నగరా మోగడంతో సినిమా వాయిదా పడుతుందంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఇప్పటికే జనవరి నుంచి మేకు షిఫ్ట్ అయిన ఈ చిత్రం మళ్లీ వాయిదా అనడంతో అభిమానులు కాస్తా అప్సెట్ అవుతున్నారు. ఈ క్రమంలో ఓ గుడ్ న్యూస్ అయితే వినిపిస్తోంది. ఈవారంతో ప్రభాస్ తన షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకుంటున్నారు. ఇటలీలో స్పెషల్ సాంగ్ చేసి సిటీకీ వచ్చిన ప్రభాస్ తో చిన్న చిన్న ప్యాచ్ వర్క్ లు అన్నీ పూర్తి చేయబోతున్నారంట. ఆ షెడ్యూల్ తర్వాత ప్రభాస్ కల్కి పార్ట్ 1కు సంబంధించిన షూటింగ్ ను మొత్తం పూర్తి చేసుకున్నట్టేనంటున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకొణె (Deepika Padukone), దిశా పటానీ, అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), కమల్ హాసన్, దుల్కర్ సల్మాన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
- బద్వేల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024on March 18, 2024 at 12:46 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో కీలకమైన నియోజకవర్గం బద్వేల్. ఎస్సీలకు ఈ నియోజకవర్గం రిజర్వ్ చేయబడింది. తొలుత 1955 నుంచి 2004 వరకు బద్వేల్ జనరల్ నియోజకవర్గంగా వుండేది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 7 సార్లు, టీడీపీ నాలుగు సార్లు, వైసీపీ మూడు సార్లు, ఇతరులు మూడు సార్లు విజయం సాధించాయి. బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కలశపాడు, బీ కొండూర్, శ్రీ అవధూత కాశీనాయ, పోరుమామిళ్ల, బద్వేల్, గోపవరం, అట్లూర్ మండలాలున్నాయి. ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,18,740 మంది. వీరిలో పురుషులు 1,09,618 మంది.. మహిళలు 1,09,115 మంది. బద్వేల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 … వైసీపీదే హవా : 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి డాక్టర్ గుణతోటి వెంకట సుబ్బయ్యకు 95,482 ఓట్లు.. టీడీపీ అభ్యర్ధి ఓబుళాపురం రాజశేఖర్కు 50,748 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా వైసీపీ 44,734 ఓట్ల మెజారిటీతో బద్వేల్ను కైవసం చేసుకుంది. అయితే వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో 2021 మార్చి 28న మరణించారు. దీంతో బద్వేల్లో ఉపఎన్నిక అనివార్యమైంది. ఆ ఎన్నికల్లో వెంకట సుబ్బయ్య భార్య సుధను వైసీపీ బరిలో దించగా.. టీడీపీ దూరంగా ఎన్నికలకు వుంది. బీజేపీ తరపున సురేష్ పోటీ చేశారు. సుధకు 1,12,211 ఓట్లు.. సురేష్కు 21,678 ఓట్లు పోలయ్యాయి. దీంతో ఉప ఎన్నికల్లోనూ వైసీపీ జయకేతనం ఎగరవేసింది. బద్వేల్ శాసనసభ ఎన్నికల ఫలితాలు 2024 .. బరిలో నిలిచేదెవరు : వైసీపీ బద్వేల్లో మరోసారి విజయం సాధించాలని పట్టుదలతో వుంది. దివంగత సుబ్బయ్య కుటుంబానికే జగన్ టికెట్ కేటాయించారు. సుబ్బయ్య సతీమణి, సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి సుధ బరిలో దిగుతున్నారు. అయితే తన ఒకప్పటి కంచుకోటలో పసుపు జెండా ఎగురవేయాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. బద్వేల్లో చివరిసారిగా టీడీపీ 2001 ఉపఎన్నికలో విజయం సాధించింది. కానీ ఈసారి టీడీపీ , జనసేన, బీజేపీ పొత్తు వుండటం.. 2021 ఉపఎన్నికలో బీజేపీ ఇక్కడ పోటీ చేయడంతో బద్వేల్లో టీడీపీ అభ్యర్ధిని ప్రకటించకపోవడంతో కమలనాథులు ఏమైనా ఈ సీటును కోరారా అన్నది తెలియాల్సి వుంది.
- March 18-Top Ten News: టాప్ టెన్ వార్తలుon March 18, 2024 at 12:42 pm
తమిళిసై రాజీనామా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. ఆమె లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఈ పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తున్నది. సెంట్రల్ చెన్నై నుంచీ బీజేపీ టికెట్ పై పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తున్నది. పూర్తి కథనం కడప నుంచి షర్మిల పోటీ? కడప పార్లమెంట్ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా వై.ఎస్ షర్మిల పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది. ఈ విషయమై ఎఐసీసీ నేతలు షర్మిలతో మాట్లాడుతున్నారని ప్రచారం సాగుతుంది. కాంగ్రెస్ పార్టీ త్వరలోనే అభ్యర్థులను ప్రకటించనుంది. పూర్తి కథనం పాడి కౌశిక్ రెడ్డి నోట జగన్ డైలాగ్ పాడి కౌశిక్ రెడ్డి ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్ పాపులర్ డైలాగ్ కొట్టాడు. మీరు కొట్టారు మేం తీసుకున్నాం. మాకు టైం వస్తుంది. మేమూ కొడతాం అంటూ జగన్ చేసిన డైలాగ్ను ఇక్కడ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కామెంట్ చేశాడు. పూర్తి కథనం ఇండియాలో మొదటిసారిగా కారు కొన్నది ఈయనే టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జెమ్షెడ్ జి టాటా భారతదేశంలో మొదటి కారును కొనుగోలు చేసిన ఘనత పొందారు. భారతదేశంలో మొదటి కారు యజమానిగా గుర్తింపు పొందిన జంషెడ్ జి ఆశ్చర్యకరమైన స్టోరీ మీకోసం… పూర్తి కథనం లిక్కర్ స్కాంపై మోడీ కామెంట్ జగిత్యాల:తెలంగాణను దోచుకున్నవారిని విడిచిపెట్టేది లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు.సోమవారంనాడు జగిత్యాలలో నిర్వహించిన బీజేపీ విజయసంకల్ప యాత్రలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు.దోపిడీదారులను వదిలిపెట్టబోమని మోడీ విమర్శించారు. పూర్తి కథనం ఇంటి నుంచి ఓటుకు అర్హులెవరు? కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్లోని 27 ఏ కింద 80 ఏళ్లు వయసు నిండిన వారికి, 40 శాతం పైగా అంగవైకల్యం వున్న వారికి పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం 80 ఏళ్లు పైబడిన వారు, దివ్యాంగులు … నోటిఫికేషన్ విడుదల చేసినప్పటి నుంచి పోలింగ్కు ఐదు రోజుల ముందే ఫారం 12 డీ కోసం దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి కథనం దానం పై వేటు వేయండి బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం సోమవారం తెలంగాణ అసెంబ్లీ స్పకీర్ గడ్డం ప్రసాద్ కుమార్ను కలిసింది. దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని పిటిషన్ అందించింది. పూర్తి కథనం రష్యా అధ్యక్షుడిగా పుతిన్ విజయం రష్యా అధ్యక్ష పదవిని పుతిన్ మరోసారి దక్కించుకున్నారు.రికార్డు స్థాయి ఓట్లను పుతిన్ పొందారు. పుతిన్ కు వ్యతిరేకంగా ఆయన ప్రత్యర్థులు పోలింగ్ స్టేషన్ల మధ్య నిరసనలు చేపట్టారు. 1999లో తొలిసారిగా పుతిన్ రష్యాకు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. పూర్తి కథనం ఓటీటీలో హనుమాన్ సరికొత్త రికార్డు జీ 5 లో విడుదలైన ఈ చిత్రం ఓటిటిలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. కేవలం 11 గంటల్లోనే 102 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ సాధించింది. పూర్తి కథనం ‘భీమా’10 రోజుల కలెక్షన్స్ ? ఫస్ట్ వీకెండ్ తర్వాత సోమవారం కూడా కొన్ని చోట్ల ఓకే అనిపించుకునే కలెక్షన్స్ తెచ్చుకున్న ఈ చిత్రం రెండో వారానికి పూర్తి డ్రాప్ అయ్యింది. పది రోజుల్లో ఎంత వచ్చింది..ఎంత వస్తే బ్రేక్ ఈవెన్ అవుతుందోచూద్దాం. పూర్తి కథనం
- మంగ్లీ ప్రమాదంలో ట్విస్ట్… వైరల్ గా స్టార్ సింగర్ సోషల్ మీడియా పోస్ట్!on March 18, 2024 at 12:37 pm
స్టార్ సింగర్ మంగ్లీ ప్రయాణిస్తున్న కారు ఆదివారం అర్ధరాత్రి ప్రమాదానికి గురైంది. డీసీఎం వాహనం వెనకనుండి మంగ్లీ ప్రయాణిస్తున్న కారును ఢీ కొట్టింది. ప్రమాద సమయంలో మంగ్లీతో పాటు మరొక ఇద్దరు కారులో ఉన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామలో ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా శంషాబాద్ మండలం తొండుపల్లి బ్రిడ్జి వద్ద డీసీఎం వాహనం మంగ్లీ కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మంగ్లీ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారు వెనుక భాగం డామేజ్ అయినట్లు సమాచారం. డీసీఎం డ్రైవర్ మద్యం సేవించి ఉన్నాడట. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ ప్రమాదం పై పలు రకాల రూమర్స్ వినిపిస్తున్న నేపథ్యంలో మంగ్లీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ప్రమాదం పై వివరణ ఇచ్చారు. ”డియర్ ఆల్… నేను క్షేమంగా ఉన్నాను. నాకు ఏం కాలేదు. ఇటీవల అనుకోకుండా చిన్న ప్రమాదం జరిగింది. ప్రచారం అవుతున్న పుకార్లను నమ్మవద్దు. మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు… ఇట్లు మీ మంగ్లీ” సోషల్ మీడియాలో కామెంట్ పోస్ట్ చేశారు. ప్రచారం అవుతున్నట్లు తనకేమీ కాలేదని. అది చిన్న ప్రమాదం అని మంగ్లీ స్పష్టత ఇచ్చారు. పుకార్లు నమ్మి అభిమానులు ఆందోళన చెందకండని ఆమె పరోక్షంగా వెల్లడించారు. టాలీవుడ్ స్టార్ సింగర్స్ లో మంగ్లీ ఒకరు. కొన్నేళ్లుగా ఆమె హవా నడుస్తుంది. అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. మంగ్లీ తన విలక్షణమైన వాయిస్ తో సంగీత ప్రియులను ఓలలాడిస్తున్నారు. స్టార్ హీరోల సినిమాల్లో అనేక సూపర్ హిట్ సాంగ్స్ ఆమె పాడారు. మంగ్లీ బతుకమ్మ, శివరాత్రి పాటలు ప్రత్యేకంగా రూపొందించి తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేశారు. మంగ్లీ సాంగ్స్ కి విపరీతమైన ఆదరణ దక్కుతుంది.
- Jagan Bus Yatra: 27 నుంచి ‘మేమంతా సిద్ధం’.. జగన్ బస్సు యాత్రon March 18, 2024 at 12:20 pm
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. సిద్ధం సభలతో ఇప్పటికే సీఎం జగన్ వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ఇప్పుడు మరోసారి బస్సు యాత్రతో హుషారు నింపనున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన రోజే సీఎం జగన్ వైసీపీ అభ్యర్థులను ప్రకటించారు. మొత్తం అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో ఇప్పుడు జగన్ ఫోకస్ క్యాంపెయినింగ్ పై పెట్టారు. మార్చి 27వ తేదీ నుంచి జగన్ బస్సు యాత్ర ప్రారంభించనున్నట్టు తెలుస్తున్నది. ఈ నెల 26 లేదా 27వ తేదీన ప్రారంభించనున్నట్టు వైసీపీ నాయకులు వెల్లడించారు. ఇడుపులపాయ నుంచి ఈ బస్సు యాత్ర ప్రారంభం కానున్నట్టు తెలిసింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగియనుంది. 21 రోజులపాటు జరిగే ఈ బస్సు యాత్ర అన్ని నియోజకవర్గాలను కవర్ చేసేలా రూట్ మ్యాప్ ప్లాన్ చేశారు. సిద్ధం సభలు జరిగిన నాలుగు జిల్లాలు మినహా మిగిలిన పార్లమెంటు నియోజకవర్గాలను కవర్ చేస్తూ ఈ యాత్ర సాగనుంది. ఉదయం పూట ఆయా ప్రాంతాల్లోని మేధావులు, స్థానిక ప్రజలతో సీఎం మాట్లాడుతారని, పాలన మరింత మెరుగుపరచడానికి సలహాలు, సూచనలు తీసుకుంటారు. సాయంత్రం పూట బహిరంగ సభలో మాట్లాడుతారని వైసీపీ వెల్లడించింది. ఈ యాత్ర కోసం బయల్దేరిన జగన్ ప్రజలతోనే మమేకం అవుతూ ఉంటారు. ఈ బస్సు యాత్రలో రాష్ట్ర ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు, ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ ప్రసంగాలు ఉండనున్నాయి. ఈ యాత్ర ముగిసిన తర్వాత పూర్తిగా క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రచారమే ఉండనుంది. ఈ బస్సు యాత్ర గురించి రేపు పూర్తిగా షెడ్యూల్, వివరాలు వెల్లడిస్తామని వైసీపీ పేర్కొంది.
- #Bhimaa:‘భీమా’10 రోజుల కలెక్షన్స్ ?బ్రేక్ ఈవెన్ కు ఎంత దూరంon March 18, 2024 at 12:17 pm
భీమా సినిమా గోపిచంద్ కు కమ్ బ్యాక్ హిట్ మూవీ అని అభిమానులు అంటున్నారు కలెక్షన్స్ లో ఆ జోరు కనిపించటం లేదు. చాలా రోజుల తర్వాత గోపిచంద్ కు హిట్ పడిందని, భీమా సినిమాలో గోపీచంద్ అదరగొట్టాడని, నటన పరంగా దాదాపుగా క్యారక్టర్ లో జీవించాడని ప్రశంసలు కురిపివారు సినిమాకు వెళ్లటం లేదు .అలాగే సినిమా కథ అటూ ఇటూగా ఉన్నా ఈ చిత్రంలో యాక్షన్ సీన్స్ అదిరిపోయాయని, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుందంటూ రివ్యూస్ వచ్చాయి. ఈ నేపధ్యంలో ఫస్ట్ వీకెండ్ తర్వాత సోమవారం కూడా కొన్ని చోట్ల ఓకే అనిపించుకునే కలెక్షన్స్ తెచ్చుకున్న ఈ చిత్రం రెండో వారానికి పూర్తి డ్రాప్ అయ్యింది. పది రోజుల్లో ఎంత వచ్చింది..ఎంత వస్తే బ్రేక్ ఈవెన్ అవుతుందోచూద్దాం. 10 రోజుల లెక్కలు తెలంగాణా – 02.82cr ( బ్రేక్ ఈవెన్ – 03.50cr) రాయలసీమ – 01.18cr ( బ్రేక్ ఈవెన్ – 01.50cr ) కోస్తాధ్ర +ఉత్తరాంధ్ర- 03.21cr ( బ్రేక్ ఈవెన్ – 04.50cr ) రెండు తెలుగు రాష్ట్రాలు 10 రోజులు మొత్తం థియేటర్ గ్రాస్ – 12.40cr రెండు తెలుగు రాష్ట్రాలు 10 రోజులు మొత్తం థియేటర్ షేర్ – 07.21cr కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా + ఓవర్ సీస్ – 00.70cr ( బ్రేక్ ఈవెన్ – 01.80cr ) వరల్డ్ వైడ్ 10 రోజులు మొత్తం థియేటర్ గ్రాస్ – 14.30cr వరల్డ్ వైడ్ 10 రోజులు మొత్తం థియేటర్ షేర్ – 07.91cr ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ షేర్ బ్రేక్ ఈవెన్ – 12.00cr ట్రేడ్ నుంచి అందుతున్న ఈ లెక్కల ప్రకారం ‘భీమా’ (Bhimaa) చిత్రానికి రూ.10.65 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.12 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఇప్పుడున్న టాక్ తో అయితే కొద్దిగా కష్టమే. ఏమన్నా ఈ రెండు రోజుల్లో పికప్ అయ్యి పాజిటివ్ టాక్ వస్తే తప్ప టార్గెట్ అందుకోవడం కష్టం. ఇదొక యాక్షన్ ఎంటర్టైనర్.. కాకపోతే కొంచెం సోసియో ఫాంటసీ టచ్ ఉన్న సినిమా. గోపీచంద్ సరసన (Malvika Sharma) మాళవిక శర్మ, (Priya Bhavani Shankar) ప్రియా భవానీ శంకర్.. లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘శ్రీ సత్యసాయి ఆర్ట్స్’ బ్యానర్పై కెకె రాధామోహన్ (K. K. Radhamohan) ఈ చిత్రాన్ని నిర్మించారు.
- ట్రెండ్ ఫాలో అవుతూ చూడముచ్చటగా ఫోజులు ఇస్తున్న ప్రగ్యా జైస్వాల్.. లేటెస్ట్ పిక్స్on March 18, 2024 at 12:17 pm
అఖండ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తో ఇకనైనా ప్రగ్యా కెరీర్ జోరందుకుంటుంది అనుకుంటున్న తరుణంలో ఆమెకి ఆఫర్స్ కరువయ్యాయి. అఖండ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో తరచుగా గ్లామర్ పిక్స్ షేర్ చేస్తోంది. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తో ఇకనైనా ప్రగ్యా కెరీర్ జోరందుకుంటుంది అనుకుంటున్న తరుణంలో ఆమెకి ఆఫర్స్ కరువయ్యాయి. అఖండ తర్వాత ప్రగ్యా ఎలాంటి చిత్రంలో నటించలేదు. బోయపాటి దర్శకత్వంలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ ఈ చిత్రంలో నటించింది. 2021లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. బాలయ్య కెరీర్ లోనే అత్యధిక గ్రాస్ రాబట్టిన చిత్రంగా అఖండ రికార్డ్ అందుకుంది. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హోమ్లీగా మెప్పించింది. కంచె చిత్రంలో హోమ్లీగా కనిపించిన ప్రగ్యా ఇప్పుడు మాత్రం గ్లామర్ షో కి ఎలాంటి హద్దులు పెట్టుకోవడం లేదు. ఇన్స్టాగ్రామ్ లో ప్రగ్యా జైస్వాల్ ఫోటో షూట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అఖండ మూవీ హిట్ అయ్యాక సక్సెస్ ని క్యాష్ చేసుకునే ప్రయత్నాల్లో ఉంది ఈ బ్యూటీ. ఫ్యూచర్ లో ప్రగ్యా కి ఎలాంటి ఆఫర్స్ వస్తాయో చూడాలి. మరింత అందంగా మారుతూ ప్రగ్యా జైస్వాల్ కళ్ళు చెదిరే ఫోటో షూట్స్ తో మెస్మరైజ్ చేస్తోంది. అఖండ సక్సెస్ సంతోషాన్ని ప్రగ్యా తన గ్లామర్ రూపంలో చూపిస్తోంది అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అయితే అఖండ విడుదలై చాలా కాలం గడచినా ప్రగ్యా జైస్వాల్ కి ఆఫర్స్ మాత్రం రావడం లేదు. తాజాగా ప్రగ్యా జైస్వాల్ వైట్ ఏంజెల్ తరహాలో ఎంతో అందంగా ఉన్న అవుట్ ఫిట్ లో మెరిసింది. ఈ ఫొటోస్ లో ప్రగ్యా జైస్వాల్ లుక్స్ చూపు తిప్పుకోలేని విధంగా ఉన్నాయి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటోలకు ప్రగ్యా జైస్వాల్ ఫీలింగ్ ఫ్రెష్ అనే కామెంట్ పెట్టింది. ప్రగ్యా జైశ్వాల్ లాంటి హీరోయిన్ కి ఆఫర్స్ రాకపోవడం ఏంటో అని మరికొందరు కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు.